13 మే, 2013

ఉత్తమజ్ఞానం

పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.

తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.

రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.

ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.
రత్నగిరి రాజ్యాన్ని పరిపాలించిన జయంతుడు అనే మహారాజుకు వరుణుడు, సంజయుడు, సుధీరుడు అనే ముగ్గురుకొడుకులు ఉండేవారు.
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన జయంతుడు తన తర్వాత రాజ్యభారాన్ని ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగించాలా అని ఆలోచించసాగాడు. మంత్రిని పిలిచి ఈ విషయం చెప్పగా, ‘‘ఇందులో సందేహం ఏముంది మహారాజా! సంప్రదాయం ప్రకారం పెద్దకుమారునికే రాజ్యాధికారం లభిస్తుంది’’ అన్నాడు.

‘‘కానీ మంత్రివర్యా! నా ముగ్గురు కుమారులలో మిక్కిలి తెలివైనవాడికే పట్టాభిషేకం చేయాలన్నది నా కోర్కె’’ అన్నాడు రాజు.

కొద్దిరోజుల తర్వాత ఒకనాడు రాజు పెద్ద కొడుకు వరుణుడిని పిలిచి ఇక్కడ ఉన్న మూడు గదులలో ఒక దానిలో దండిగా ధాన్యరాశులు ఉన్నాయి. రెండవదానిలో ఆయుధ సంపత్తి ఉంది. మూడవదానిలో పుష్కలమైన ధనరాశులు ఉన్నాయి. ప్రజాక్షేమం దృష్ట్యా ఏదో ఒక గదిని కోరుకోమంటే నీవు ఏ గదిని కోరుకుంటావు?’’ అని ప్రశ్నించాడు.

‘‘ప్రజలకు అన్నిటికంటే ఆహారం ముఖ్యం. అందువల్ల ధాన్యరాశులు కోరుకుంటాను’’ అన్నాడు వరుణుడు.

రెండవ కొడుకు సంజయుడిని పిలిచి ఇదే ప్రశ్నవేయగా ‘‘శత్రువులు దండెత్తివచ్చినప్పుడు తింటూ కూర్చుంటే సరిపోదు. యుద్ధం చేయడానికి ఆయుధాలు కావాలి కాబట్టి ఆయుధాలున్న గదినే కోరుకుంటాను’’ అన్నాడు.

మూడవ కొడుకు సుధీరుడిని పిలిచి ప్రశ్నించగా ‘‘నేను ధనరాశులున్న గదినే కోరుకుంటాను. ఎందుకంటే పుష్కలమైన ధనం ఉంటే ఆహారం, ఆయుధాలు ఎంతైనా సమకూర్చుకోవచ్చు. మిగిలిన ధనంతో ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చు’’ అన్నాడు.
రాజు సుధీరుడికి పట్టాభిషేకం చేసి, తాను వానప్రస్థానికి తరలిపోయాడు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62123&Categoryid=13&subcatid=0#sthash.7lOilr5W.dpuf
హోం > వివరాలు

ఉపదేశం
 పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf
పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు. - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf
పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf
పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62245&Categoryid=13&subcatid=0#sthash.lhoKIjZ5.dpuf

జిత్తులమారి తోడేలు


అనగనగా ఒక అడవి ఉంది.  ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది.  అది బాగా జిత్తులమారిది.  అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది.  పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి.  అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు.  తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి.  “ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది.  ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది.  ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది.  ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు.  నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం” అని అంది.  ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది.  ఈ తోడేలు చాలా జిత్తులమారింది.  ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది.  దీని మాటలు అసలు నమ్మకూడదు.  ఇది నన్ను కూడా మోసం చేస్తుంది.  అందుకని దీని వలలో పడకూడదు.  కాని పైకి ఇలా అంది “నేను నమ్మను.  నీది బాగా చెడు బుద్ది.  చాలా జంతువులను మోసం చేశావు.  అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు” అంది.
 అది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, “మామా! నేను ఇపుడు చాలా మారాను.  అసలు మాంసాహారము ముట్టడం లేదు.  నేను శాకాహారమునే తీసుకుంటున్నాను.  నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను.  నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు.  నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు.  నన్ను నమ్ము.  నువ్వు ఎలా చెబితే అలా వుంటాను.  అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు.  మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను.  అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును.  ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది.  ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది.  “నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను”.
అందుకే తోడేలు “నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను.  మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం.  కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి.  ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది.  ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది.  ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది.  వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.
 ఒకరోజు తోడేలు ఒంటెతో “మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది.  నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి,  చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!” అని అంది. ఒంటె ఒప్పుకుంది.  తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది.  ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది.  ఒంటెకు నోరు ఊరింది.  చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి.  మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది.  ఒంటెకు ఉత్సాహంగా ఉంది.  దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి “నీవు నా వీపు మీద కూర్చో”అంది.  తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది.  రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి.  చెఱకు తోటలోకి నడిచినాయి.
 ఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి “మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది.  నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు”అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు.  ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది.  తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది.  తోట యజమానికి వినపడేలా అరిచింది.  ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.
 తోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు.  చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు.  అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు.  కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది.  వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది.  అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది.  “మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు.  నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు.  ఇంటికి చేరగానే మందు రాస్తాను పద” అంది.  ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది.  దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది.
ఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది.  తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది.  ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె,  నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది.  నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. “అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో” అంది.  తోడేలుకు అప్పుడు అర్దమైంది.  దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది.  ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది.