23 మార్చి, 2012

తీర్ధయాత్రల మహిమలు

ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరు ల నుండి ఏమీ ఆశించని వారు మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎ న్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దానధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతా రు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు.కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు. 
            సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్ధం ప్రశిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వ మేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసిం చిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్ధంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసి న ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యంయ యాతిపతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్ధం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నా నం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది.
      వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నా నం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్ధంలో శివుని పూ జించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్ధం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్ధంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.
      శివుడు నివసించే దేవికాక్షేత్రాన్ని , కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్గసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భే ద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్ధం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్ర కోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్ధం, పుష్కర తీర్ధం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు. 
కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉన్నది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణు మూర్తిని పూజించినా, పారిప్లవ తీ ర్ధంలో, శాలుకినీ తీర్ధంలో, సర్పతీర్ధంలో, వరాహతీర్ధంలో, అశ్వినీ తీర్ధంలో, జయంతిలో ఉండే సోమతీర్ధంలో, కృత శౌచ తీర్ధంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది. 
               అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్ధంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజుల ను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచ కం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతు న్నా యి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. 
             కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్ధం, కపిల తీర్ధం, సూర్యతీర్ధం, గోభనం, శంఖినీ తీర్ధం, యక్షేంద్రతీర్ధం, సరస్వతీ నది, మాతృ తీర్ధం, బ్రహ్మావర్తం, శరవ ణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్ధం, ఆపగ నదీ తీర్ధం, సప్తఋషి కుం డం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలా స్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి .
     నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్ధంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్ధంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్ధంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సు దినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్య లోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నాన మాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలు గుతుంది. వామన తీర్ధంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పో తారు. పావన తీర్ధంలో స్నానమాచరించిన వంశం పవిత్ర మౌ తుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సి ద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్ధంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కలుగుతుం ది. ఔశనశం, కపాల మో చనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్ధంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.
              గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్ధంలో స్నానం చేస్తే సర్వదు॰ఖ విముక్తి కలుగుతుం ది. స్వస్తి పురం అనే తీర్ధం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్ధంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్య్డిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది. దధీచి తీర్ధంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్ని హిత తీర్ధంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందు తారు. ధర్మతీర్ధంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుం డి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగమ్ ఛెశీణా ఫాళామ్ వ్స్తుంది. శాకంబరీ తీర్ధంలో ఒక రోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రధావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తు లౌ తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి